ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.శ్రద్ధను హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహం ముక్కలను నిందితుడు ఆఫ్తాబ్ సూరజ్ ఖండ్ లో పడేసినట్లు సమాచారం.
ఆఫ్తాబ్ ప్లాట్ కు 15 కిలోమీరట్ల దూరంలో సూరజ్ ఖండ్ ప్రాంతం ఉంది.మరోవైపు ఆఫ్తాబ్ అరాచకాలపై శ్రద్ధ స్నేహితులు మరిన్ని నిజాలు చెప్పినట్లు తెలుస్తోంది.
శ్రద్ధను తిట్టడం, కొట్టడంతో పాటు సిగరెట్ తో కాల్చినట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో నిందితుడికి ఇవాళ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
అదేవిధంగా సోమవారం నార్కో టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది.హత్య అనంతరం బాలీవుడ్ దృశ్యం పార్ట్ 1 చూశానని నిందితుడు విచారణ చెప్పాడని పోలీసులు తెలిపారు.
శ్రద్ధ మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన ఐదు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.