సింహం త్వరలో మీ ముందుకు అంటూ ఏలూరు లో దెందులూరు మాజీ టీడీపీ ఎమ్యెల్యే చింతామనే ప్రభాకర్ కు సంబందించిన పోస్టర్లు దాదాపు 20 ప్రాంతాల్లో అకస్మాత్తుగా వెలువడడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇప్పటికే అనేక కేసులలో ఇరుక్కుని జైలుపాలైన చింతమనేనికి బెయిల్ రాకుండా పోలీసులు ఒక్కో కేసును తెరపైకి తీసుకొచ్చి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో ఒక్కసారిగా చింతమనేని బయటకి రాబోతున్నట్టుగా ఫ్లెక్సీలు వెలువడ్డాయి.అయితే ఇది ఆ నోటా ఈ నోటా పాకి వైరల్ గా మారడంతో వెంటనే అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది వాటిని తొలిగించారు.
అనేక కేసుల్లో చింతమనేని ఏలూరు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్నారు.నవంబర్ 20వ తేదీ వరకూ చింతమనేని రిమాండ్ను జిల్లా కోర్టు పొడిగించింది.
దెందులూరు నియోజవర్గ పరిధిలోని పెదపాడు, దెందులూరు, పెదవేగి పోలీస్ స్టేషన్లలో ఇటీవల చింతమనేనిపై నాలుగు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతమనేని ప్రభాకర్పై మొత్తం గా 54 కేసులు నమోదయ్యాయి.
ఇటీవల చింతమనేని ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పరామర్శించి మీ వెనుక మేము ఉన్నాము.మీ కేసుల విషయంలో పోరాడతాము అంటూ భరోసా ఇచ్చారు.
చింతమనేని మీద వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది అని ఆయన అనుచరులు ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆరోపణలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 20 వ తేదీన చింతమనేని రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయన విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా భావించి ఈ ఫ్లెక్సీలు వేసినట్టుగా తెలుస్తోంది.