చాలా ఏండ్లుగా కొనసాగుతున్న చిక్కుముడికి ఇంకా సమాధానం దొరకట్లేదు.ప్రపంచం అంతా దాని చుట్టూ ఎన్నో ఏండ్లుగా పరిశోధనలు జరపుతున్నా కూడా ఇంకా ఓ కొలిక్కి రావట్లేదు.
అదే గ్రహాంతర వాసుల విషయం.అసలు ఈ సృష్టిలో మనిషి ఒక్కడే ఉన్నాడా లేదా ఇతర గ్రహాల మీదెవరైనా జీవిస్తున్నారా అనే విషయం మాత్రం ఇంకా తెలియట్లేదు.
ఇప్పటికే దీనిమీద ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి.ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి.
అయితే ఇప్పుడు ఈ విషయంలో సంచలన నిజాలు వెల్లడయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న టెక్నాలజీని బేస్ చేసుకుని ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.
ప్రస్తుతం ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో భాగంగా ఓ సంచలన విషయం తెలిసింది.ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన రేడియో యాంటెన్నా నెట్ వర్క్ మొత్తం నెదర్లాండ్స్ దేశంలో నిర్మితమై ఉంది.
రీసెంట్ గా ఈ యాంటెన్నా 19 అరుణ మరుగుజ్జు నక్షత్రాలకు సంబంధించిన రేడియో సిగ్నల్స్ ను కనిపెట్టిందంట.ఈ నక్షత్రాల మూలంగా వచ్చే సిగ్నళ్లను ఈ యాంటెన్నా లోతుగా అధ్యయనం చేసినట్టు చెబుతున్నారు సైంటిస్టులు.
వాస్తవానికి ఖగోళంలో ఇంకా ఈ నక్షత్రాల చుట్టూ మరేమైనా గ్రహాలు కూడా ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు.ప్రస్తుత సౌర కుటుంబ వ్యాప్తంగా వెల్లడవుతున్న ఈ తరంగాల ఆధారంగా మరిన్ని మరుగుజ్జు నక్షత్రాలు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు సైంటిస్టులు.మరి రాబోయే రోజుల్లో వీటిమీద ఇంకిన్ని పరిశోధనలు జరిపి ఇంకేమైనా గ్రహాలు ఉంటే వాటి గురించి శక్తివంతమైన రేడియో తరంగాలను గుర్తించేందుకు ఈ యాంటెన్నాను డెవలప్ చేస్తామంటున్నారు సైంటిస్టులు.ఈ సిగ్నల్స్ కారణంగా రాబోయే రోజుల్లో మరిన్ని పరిశోధనలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.
చూడాలి మరి భవిష్యత్లో ఏమైనా విషయాలు తెలుస్తాయో లేదో.