తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోతున్న విషయం తెలిసిందే.రాష్ట్రం వేరైనప్పుడు మిగులులో ఉన్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల కుప్పగా మారిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంలో కాగ్ నివేదిక చర్చనీయాంగా మారింది.
ముఖ్యంగా రాష్ట్రంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టిన నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదంటూ, అతిపెద్ద ప్రాజెక్టుగా చూపిస్తున్న కాళేశ్వరం కింద ఎకరా ఆయకట్టు కూడా పారలేదంటూ వెల్లడించడం సంచలనంగా మారింది.
అదీగాక కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్షణ అవసరాలు లేకున్నా అప్పు తీసుకున్నారని, దీంతో రాష్ట్రం పై వడ్డీభారం అధికం అవుతుందని కాగ్ తన నివేదికలో పేర్కొనడం విమర్శలకు దారి తీస్తోంది.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఇంకా చేతికందడం లేదని అయితే ఎండ్ల కిందటే పూర్తి చేయాల్సిన వాటిని ఎందుకు సాగదీస్తున్నారనే కోణంలో కాగ్ వేలెత్తి చూపించింది.ఈమేరకు రూ.539 కోట్లు అప్పు తక్షణ అవసరం లేకున్నా కాళేశ్వరం విషయంలో తీసుకుని అనవసరంగా రూ.8.51 కోట్ల వడ్డీ చెల్లించడాన్ని కాగ్ తప్పుబట్టింది.ఇలా జాప్యం కారణంగా రూ.1.8 లక్షల కోట్ల అదనపు భారం పడుతోందని పేర్కొంది.మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం పదవుల కోసం ప్రజలను మోసం చేస్తుందా అనే అనుమానాలు కొందరిలో చోటు చేసుకుంటున్నాయాట.
అయినా ఈ భారాన్ని మోసేది ప్రజలే గానీ ప్రభుత్వాలు కాదుగా.?
.