హైదరాబాద్ లో మరో భారీ డ్రగ్ రాకెట్ బయటపడింది.నగరంలో లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందించే మందుల్ని అక్రమంగా తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది.
తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఫ్యాక్టరీకి పై ఆకస్మిక దాడి చేసి మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు.కెటమైన్ అనే మత్తు మందును ఐదేళ్లుగా ల్యాబ్ లో తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
బెంగుళూరులో ఇద్దరు వ్యక్తులు పట్టుబడటంతో హైదరాబాద్లోని ఇంతం ల్యాబ్ విషయం వెలుగులోకి వచ్చింది.ఈ మందులు మహిళలపై వాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఆ మాఫియా ముఠా ఇచ్చిన సమాచారంతో నాచారంలో ఉన్న ఇంతం ల్యాబ్లో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసారు.దీంతో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు కి ల్యాబ్ కి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఇంతం ల్యాబ్ను డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు సీజ్ చేశారు.
ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలో ఉంటారని అధికారులు చెబుతున్నారు.
మనిషిలో సెక్స్ హార్మోన్లు పెరిగేలా ఈ మందులు ప్రభావం చూపిస్తాయని తెలుస్తుంది.దీనికి సంబంధించి ఇంతం ల్యాబ్ యజమాని వెంకటేశ్ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.