JD Lakshminarayana: వచ్చే ఎన్నికలలో విశాఖ నుండి పోటీ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..!!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ నుండి మరోసారి లోక్ సభకి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

 Sensational Comments Of Former Cbi Jd Lakshminarayana About Next Elections Jd La-TeluguStop.com

అంతేకాదు తన భావాలకు అనుగుణంగా ఉండే పార్టీతో ఉంటానని తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలు  మళ్ళీ కలిస్తే మంచిదే అన్ని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని చెప్పుకొచ్చారు.తాను ఏ పార్టీ తరపున పోటీ అన్నదానిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

తన భావజాలానికి మద్దతు తెలిపే పార్టీలతోనే పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.ఇదిలా ఉంటే 2019 ఎన్నికలలో లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తరఫున విశాఖ పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత జనసేన పార్టీ నుండి బయటికి వచ్చేయడం జరిగింది.ఇక ఇదే సమయంలో మరోసారి విశాఖపట్నం నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నట్లు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube