విభజనతో ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో విభజన సమయంలో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం.
ఏపీకి ప్రత్యేక హోదా అనే హామీ ఇవ్వడం జరిగింది.అయితే ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తెలిసిందే.
ఈ క్రమంలో విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ఎన్నికలు జరగగా ఇప్పటివరకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు.ఇటువంటి తరుణంలో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నాయకురాలు పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ప్రజలు పట్టం కట్టడంతో.సంతోషం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు.
బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో జగన్ స్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.వచ్చే ఎన్నికలలో సీట్లు సర్దుబాటుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతున్నట్లు పురందేశ్వరి చెప్పుకొచ్చారు.