ఏపీలో బలమైన పార్టీగా ఉన్నటువంటి వైసీపీలో కూడా ఇప్పుడు వైరాలు మొదలువుతున్నాయి.అంతర్గత పోరుతో ఆ పార్టీ అట్టుడుకుతోంది.
ముఖ్యంగా సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉంటున్నారు.జగన్ కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని పార్టీ కోసం పనిచేసిన తమను కాదని వేరే వారికి ఇవ్వడం ఏంటంటూ మండిపడుతున్నారు.
కానీ ఈ వ్యతిరేకతను పైకి చూపించట్లేదు.అయితే ఇన్ని రోజులు ఏపీలో ఇంటిపోరు అంటే కేవలం టీడీపీ మాత్రమే గుర్తుకు వచ్చేది.
ఆ పార్టీలోనే ఒకిరపై ఒకరు బహిరంగంగాఏ విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం మనం చూశాం.
కానీ ఇప్పుడు వైసీపీలోనే ఇలాంటి ధోరణి కనిపిస్తోంది.
ఇప్పుడు జగన్ పార్టీలో చాలామంది సీనియర్లు తమ సీనియార్టీకి తగ్గ పదవులు ఇవ్వట్లేదని వాపోతున్నారంట.వారేమో ప్రభుత్వ పరమైన పదవులు ఆశిస్తే జగన్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
వారు కోరుకుంటున్నట్లు కాకుండా పార్టీ పరంగా వారికి ప్రముఖమైన పదవులు ఇవ్వాలని జగన్ చూస్తున్నారంట.దీంతో తమకు ఇష్టం లేకపోయినా మొహమాటానికి అయినా ఓకే అంటున్నారంట సీనియర్లు.
ఇకపోతే త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండబోతున్న క్రమంలో జూనియర్లు బాగానే ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పుడున్న వారిలో కనీసం ఇరవై మంది అయినా మంత్రి పదవులు పోగొట్టుకుంటారనే టాక్ నడుస్తోంది.దీంతో జూనియర్లు ఈ పదవుల కోసం సీనియర్లతో పోటీ పడుతున్నారు.సీనియర్లు కూడా ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసినందుకు తమకే అవకాశం ఇస్తారని వారు కూడా ఆశలు పెట్టుకుంటున్నారు.
కానీ జగన్ మాత్రం జిల్లా పెద్దలుగా సీనియర్లకు పార్టీ బాధ్యతలను ఇవ్వాలని చూస్తున్నారు.వారి సీనియార్టీని రాబోయే ఎన్నికల కోసం వాడుకోవాలని జగన్ భావిస్తున్నాకరంట.ఇందులో భాగంగానే తనకు అనుకూలంగా ఉండే వారికి మంత్రి పదవులు ఇవ్వనున్నారంట.
.