కరోనా ముందు కరోనా తర్వాత అని చాలా మంది హీరోల పరిస్థితి మారిపోయింది.వారి కెరీర్ విషయం అగమ్యగోచరంగా మారింది.
ముఖ్యంగా ఓటిటి వంటి ప్లాట్ ఫామ్ వచ్చిన తర్వాత సీనియర్ స్టార్ల కోసం థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారా? రారా? అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది.మరి ఇదే విషయాన్నీ రుజువు చేస్తూ కొంత మంది సీనియర్ హీరోల సినిమాలను ప్రేక్షకులు రిజక్ట్ చేసారు.
భాషతో సంబంధం లేకుండా సీనియర్ హీరోల సినిమాలు ప్లాప్ అవ్వడంతో వారంతా షాక్ అయ్యారు.ఈ డిజాస్టర్స్ తర్వాత ఈ సీనియర్ హీరోల పరిస్థితి గురించి సర్వత్రా చర్చ జరిగింది.
కానీ ఈ కామెంట్స్ ను అబద్దం చేస్తూ ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డు క్రియేట్ చేస్తూ వసూళ్లతో హోరెత్తిస్తున్నాయి.మరి అద్భుతమైన కలెక్షన్స్ సాధించిన సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఏంటో చూద్దాం.
పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో మళ్ళీ రంగంలోకి దిగారు.ఈ సినిమాతో భారీ వసూళ్లను రాబట్టి మళ్ళీ చిరు స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు.ఇక రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో 200 కోట్ల మార్క్ క్రాస్ చేసి మరిన్ని కలెక్షన్స్ దిశగా దూసుకు పోతుంది.
కమల్ హాసన్ కూడా నాలుగేళ్ళ విరామం తర్వాత విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించాడు.ఎన్నో ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో రికార్డులు సృష్టించి బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపాడు కమల్.
అలాగే మరో సీనియర్ స్టార్ హీరో బాలయ్య బాబు కూడా అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకుంది ఇటీవలే సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.తన సినిమాతో ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించి బాక్సాఫీస్ ను షేక్ చేసాడు.
అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఇటీవలే పఠాన్ సినిమాతో వచ్చాడు.ఎన్నో రోజులుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెల బోతుంది.ఇలాంటి సమయంలో 57 ఏళ్ల ఈ సీనియర్ హీరో బాక్సాఫీస్ ను షేక్ చేసే హిట్ అందుకున్నాడు.
వారం కూడా అవ్వక ముందే 500 కోట్ల మేర వసూళ్లను రాబట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు.ఇలా ఆరు పదుల వయసులో కూడా సీనియర్ హీరోలు తమదైన శైలిలో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు.