స్వర్గీయ నందమూరి తారక రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి రాజకీయాల ద్వారా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి 1996లో జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసిన లక్ష్మీపార్వతి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.
ఆ తరువాత 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసినా ఆ ఎన్నికల్లో విజయం మాత్రం దక్కలేదు.గత కొన్నేళ్ల నుంచి వైసీపీకి మద్దతు ఇస్తూ ప్రస్తుతం లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమాస్తులకు సంబంధించి 15 సంవత్సరాల క్రితం లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికీ విచారణ జరుగుతోంది.అయితే సినీ రంగంతో అనుబంధం ఉన్నా సినిమాలకు దూరంగా ఉన్న లక్ష్మీ పార్వతి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాధాకృష్ణ సినిమాలో లక్ష్మీపార్వతి కీలక పాత్రలో నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే లక్ష్మీపార్వతి నిజంగా సినిమాల్లో నటిస్తున్నారో లేదో తెలియాల్సి ఉంది.చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న లక్ష్మీపార్వతి నిజంగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారో లేదో చూడాల్సి ఉంది.
అయితే రాధాకృష్ణ చిత్రయూనిట్ నుంచి మాత్రం లక్ష్మీపార్వతి తమ సినిమాలో నటిస్తున్నట్టు ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న హీరోలుగా కొనసాగుతున్నారు.రాధాకృష్ణ సినిమాలో లక్ష్మీపార్వతి నిజంగా నటిస్తే మాత్రం ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
రాజకీయాల్లో మిశ్రమ ఫలితాలను అందుకున్న లక్ష్మీపార్వతి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఇక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.అయితే లక్ష్మీపార్వతి అభిమానులు మాత్రం ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.