విశాలాంధ్ర మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు.గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
విశాలాంధ్ర సంపాదకులుగా ఆయన చేసిన సేవలు మరవలేనివని, పాత్రికేయులుగా ఆయన సమాజం కోసం పాటుపడ్డారని ఈ సందర్భంగా పలువురు తెలిపారు.ఆయన మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని పలువురు పాత్రికేయులు సానుభూతి తెలిపారు.
వరంగ్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో 1939 సెప్టెంబర్ 10న జన్మించిన ఆయన 33 ఏళ్లు విశాలాంధ్రకు ఎడిటర్గా వ్యవహరించారు.
విలువలు, నిబద్ధతకు కట్టుబడిన వ్యక్తిగా రాఘవాచారి నిలిచారు.కాగా ఆయన భౌతికకాయాన్ని మఖ్దుమ్ భవన్కు తరలించి అక్కడి నుండి విశాలాంధ్ర కార్యాలయానికి తరలించనున్నారు.ఆయన మృతిపట్ల పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.