సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.
బోయపాటి శ్రీను తన ప్రతి సినిమాలో విలన్ ను బలమైన పాత్రలో చూపిస్తాడు.ఫ్యామిలీ సినిమాల్లో నటించిన జగపతి బాబును లెజెండ్ సినిమాతో స్టైలిష్ విలన్ గా మార్చిన ఘనత బోయపాటి శ్రీనుకే దక్కింది.
ప్రస్తుతం జగపతి బాబు వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.బోయపాటి శ్రీను బాలయ్య సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటిస్తే రాజశేఖర్ కూడా వరుస అవకాశాలతో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.
రాజశేఖర్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడని బాలయ్య రాజశేఖర్ కాంబినేషన్ లో ఉండే సీన్లు అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం.అయితే రాజశేఖర్ పాత్ర సినిమాలో 20 నిమిషాలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో బాలయ్య ఒక పాత్రలో అఘోరాగా కనిపించనున్నాడని సమాచారం.ఈ సినిమాలో పూర్ణ, సాయేషా సైగల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరోవైపు రాజశేఖర్ కొన్ని రోజుల క్రితమే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.రాజశేఖర్ కుటుంబ సభ్యులు దీపావళి వేడుక జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
గత కొన్నేళ్లలో బాలకృష్ణ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ ఫలితాన్ని అందుకున్నాయి.దీంతో బాలయ్య ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని నమ్మకంతో ఉన్నారు.2021 సమ్మర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.