రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజం అన్న విషయం తెలిసిందే.కానీ ఓడిన పార్టీ మాత్రం మరోసారి తప్పక గెలిచి తీరాలనే కసితో పనిచేయడం అందరికి తెలిసిందే.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే పొలిటికల్ మైలేజీలో చాలా వెనకబడి ఉంది.వరుస అపజయాలతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఉంటుదా, లేదా అనే అనుమానం వచ్చేలా కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గాని కనిపిస్తుంది.
అదీగాక ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న హస్తం పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కేడర్ను కోల్పోయామన్న నిరాశ వద్దని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ, తర్వాతి లక్ష్యంపైనే దృష్టి సారిస్తే గెలుపు సొంతం అవుతుందని ఉత్సాహ పరిచారు.
ఈ రాజకీయ పోరులో ఓడినా, గెలిచినా బీజేపీలాగా ఆలోచిస్తూ ముందుకు సాగాలని వెల్లడించారు.ఎప్పుడు పార్టీ కోసం ఐకమత్యంతో పనిచేయాలని, ఇగోలు ఉంటే పక్కన పెట్టి గెలుపుకోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని పార్టీ నేతలకు సూచించారు.
అయినా ఎంతమంది ఎన్ని చెప్పిన హస్తం, కమళం అవుతుందా, అధికారంలోకి వస్తుందా అని అనుకుంటున్నారట.