సినిమా వాళ్లు ఒకప్పుడు రాజకీయాల్లో రాణించారు, అద్బుతమైన ప్రజా ఆమోదం పొందారు, కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటున్నారు సీనియర్ హీరోయిన్ జమున.ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.
కుళ్లు రాజకీయాల్లోకి సినీ తారలు వెళ్తే ఖచ్చితంగా ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదు.అందుకే రాజకీయాలకు సినీ తారలు దూరంగా ఉండాలని జమున అంటుంది.
తాను చిరంజీవితో ఉన్న సన్నిహిత్యం వల్ల అప్పట్లో నువ్వు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.రాజకీయాల్లో నువ్వు రాణించలేవని చెప్పాను.
చిరంజీవికి అప్పటి రాజకీయ పరిస్థితులు, ఇప్పటి రాజకీయ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశాను.కాని ఆయన నవ్వి ఊరుకున్నాడు.ఆ తర్వాత కొన్నాళ్లకే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు.రాజకీయాల్లో చిరంజీవి పరిస్థితి ఏంటో తెలిసిందే.నేను చెప్పినట్లుగానే చిరంజీవి విషయంలో జరిగింది.అప్పట్లో ఇందిరా గాంధీ మరియు రాజీవ్ గాంధీలు నన్ను పిలిచి రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చేయమని కోరడంతో నేను అప్పట్లో పోటీ చేశాను.
అప్పుడు రాజకీయాల్లో ప్రజా సేవ చేయాలనుకునే వారు మాత్రమే వచ్చేవారు.అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి పూర్తి విరుద్దం.అందుకే రాజకీయాల్లోకి ఇప్పుడు వెళ్లాలనుకునే వారు అవినీతి పరులు అవుతున్నారు అన్నారు.కోటి రూపాయలు ఖర్చు చేసి పది కోట్ల రూపాయలను పోగు చేసుకోవాలని చూస్తున్నారని జమున అన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో నెగ్గుకు వస్తాడనే నమ్మకం లేదు.ఆయన నాకు పరిచయం లేడు.ఒకవేళ పవన్ పరిచయం ఉండి ఉంటే తప్పకుండా నీకు రాజకీయాలు నప్పవు అంటూ చెప్పేదాన్ని.మనం దేవుళ్లం, ప్రేక్షకులు మనను దేవుళ్ల మాదిరిగా పూజిస్తారు.
అలాంటి మనం రాజకీయాలు చేయడం వారికి నచ్చదు అంటూ జమున సినీ వర్గాల వారిని ఉద్దేశించి చెప్పుకొచ్చింది.