ఈ ఏడాది ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వల్ల ఎంతో ప్రాణ నష్టాలు జరిగాయి.అంతేకాకుండా పలుచోట్ల గాలి ల ద్వారా విషపు రసాయనాల పదార్ధాలు కూడా వెలువడ్డాయి.
దీంతో అక్కడ కూడా ప్రజలు ప్రాణాలతో కొట్టుమిట్టారు.అందుకే ఈ ఏడాదిలో జరిగిన ఘటనలు వచ్చే ఏడాది లో ఎలాంటి సమస్యలు రావద్దంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్.
తెలుగు నటుడు రాజేంద్రప్రసాద్.ఆయన నటుడుగానే కాకుండా నిర్మాతగా, సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.ఎక్కువగా హాస్య చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇదిలా ఉంటే కరోనా వైరస్ నుంచి వచ్చిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని బుధవారం ఉదయం తిరుమలలో విఐపీ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్ని 2021లో అందరికీ మంచి జరగాలని అంటూ ఆ శ్రీవారిని కోరిన విషయం తెలుపుతూ…
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని తినే ఆహార పదార్థాల నుంచి మార్పులు జరిగాయంటూ.శ్రీవారి దర్శనంలో కరోనా జాగ్రత్తలు పాటించారన్నా విషయాన్ని తెలిపారు.
ఒకప్పుడు హీరోగా ఉన్నా రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం వేరే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాదిలో వచ్చిన అలా వైకుంఠపురం, సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించగా… ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ ఈ చిత్రంలో నటించారు.కాగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నా రాజేంద్ర ప్రసాద్ శ్రీ విష్ణు హీరో గా చేస్తున్నా సినిమా ” గాలి సంపత్” లో నటిస్తున్నారు.
అంతేకాకుండా రవితేజ నటించిన ఎఫ్ 3 సినిమా లో బిజీగా ఉండగా.రౌడీ బేబీ, లవ్ ఎట్ 65 అనే ఈ సినిమాల్లో కూడా అవకాశం వచ్చింది.