గత ఏడాది టాలీవుడ్ లో వరుసగా నటుల మరణం విషాదంగా మారింది.ఈ ఏడాది ఆరంభంలో మరల వరుసగా నటులు చనిపోతూ ఉండటం కొంత కలవరపెడుతుంది.
కొద్ది రోజుల క్రితం నటి, రాజీవ్ కనకాల చెల్లి క్యాన్సర్ తో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఇప్పుడు సీనియర్ నటుడు పలు సినిమాలలో విలన్, కామెడీ విలన్ పాత్రలు చేసిన మెప్పించిన నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్ళిపోయాడు.
అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
గత కొంత కాలంగా కిడ్నీసమస్యతో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు.
ఎప్పటిలా గానే డయాలసిస్ చేయించుకున్న ఆయన సాయంత్రం 4 గంటల టైమ్ లో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.కుటుంబ సభ్యులు గుర్తించి అతనిని సోమాజిగూడా యశోదా హాస్పటల్ కి తరలించగా, కోమాలోకి వెళ్లినవెళ్లిట్లు డాక్టర్లు గుర్తించారు.48 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు.ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ కొనసాగుతోంది.
అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసి పలువురు నటులు, నర్సింగ్ యాదవ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి పరామర్శించారు.