వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇది నిజమే అని చెబుతారు అక్కడ నమ్మిన భక్తులు.అంతటితో ఆగకుండా తమకైన అనుభవాలను, అలాగే ఇరుగు పొరుగువారి అనుభవాలను కూడా రంగరించి మరీ చెబుతున్నారు.
మామ్మూలుగా ఎవరన్నా తమ ఇష్ట దైవం గుడికి వెళ్లి, తన మనసులోని కోర్కెలను చెప్పుకుంటూ ఉంటారు.అవి తీరితే మరలా మేము వస్తామని, అలాగే తల నీలాలు ఇస్తామనో… ముడుపు చెల్లించుకుంటామనో చెబుతూ ఉంటారు.
ఇది దాదాపుగా అందరు భక్తులు చేసేదే.
కానీ రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ లోని రణథం బోర్ లో త్రినేత్ర గణేశుడి ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం.
అదేమిటో చూద్దాం… ఇక్కడి భక్తులు కోర్కెలు తీర్చమని నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లరట…! తమ సమస్యల చిట్టాను పెడుతూ వారు తమకిష్టమైన గణేశుడికి ఉత్తరం రాస్తారట.అక్కడితో వారు తమ బాధల బరువుని దించేసుకుంటారట.రాజస్థాన్ రాష్ట్రంలోని రణధంబోర్ ఆలయంలో వినాయకుడు చాలా ప్రత్యేకం.మూడు నేత్రాలతో వెలసిన త్రినేత్రుడాయన.
ఎన్ని కష్టాలు ఉన్నా ఇక్కడి గణపతికి లేఖరాస్తే చాలు.అతనే చూసుకుంటాడని అక్కడి భక్తులకు అపార విశ్వాసం.అందుకే తమకు ఏ కష్టం ఎదురైనా నేరుగా స్వామివారి అడ్రస్ కు ఉత్తరం రాసేస్తారు.అంతే కాకుండా, భక్తులు రాసే ఉత్తరాలను ఓ పోస్టుమ్యాన్ అక్కడికి రోజూ తీసుకొచ్చి విఘ్నాలను తొలగించే స్వామి పాదాల వద్ద వుంచుతారట.
తరువాత అక్కడి పురోహితులు వాటికోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట.చాలా బాగుంది కదూ.ఇంకెందుకాలస్యం.వెంటనే ఉత్తరం అందుకొని మీ కోర్కెల చిట్టాను విప్పి.
సవాయ్మ ధోపుర్ జిల్లా, రణథంబోర్ గ్రామం, పిన్ కోడ్: 322021 అడ్డ్రస్ కు పోస్ట్ చేయండి.అటుపైన మీ కష్టాలు మాయం.