సెల్ఫీ మోజుతో చాలా మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.చాలా మంది ఇలా పిచ్చి పనులు చేసి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.
సరదాగా కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో మరోసారి తాజాగా జరిగిన ఓ ఘటన రుజువు చేసింది.ఓ ఫారెస్ట్ కి అడవి జంతువులని చూడటానికి వెళ్ళిన పర్యాటకులు కాస్తా శ్రుతి మించి ఏనుగులతో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నం చేశారు.
అయితే ఏనుగుకి కోపం వచ్చి వారి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది.క్షణాల్లో వారు ఆ ఏనుగు బారి నుంచి బయటపడ్డారు.
ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడుకు చెందిన కొంత మంది పర్యాటకం నిమిత్తం అభయారణ్యంలోకి వెళ్లగా వారికి 50 ఏనుగులు కనిపించాయి.
వాటిని చూసి సరదా పడ్డ పర్యాటకులు ఏనుగుతో సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నం చేశారు.ఓ ఏనుగు వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకోవాలని అనుకున్న సమయంలో ఆ ఏనుగు కంగారు పడి ఏదో చేస్తున్నారని భావించి వారిపై దాడికి ప్రయత్నం చేసింది.
ఏనుగు దాడి చేయబోతుందని గ్రహించి వారు పరుగు తీశారు ఇంతలో ఓ వ్యక్తి కింద పడిపోయాడు.అతడు లేచి పరిగెత్తబోతుండగా ఏనుగు అతని మీద దాడి చేసి తొండంతో నెట్టింది.
కాస్త దూరంలో పడిన అతను వెంటనే తేరుకొని లేచి మళ్లి పరిగెత్తాడు.ఏనుగు అతడిని వెంబడించిన ఎలాగోలా దాని నుంచి బయటపడ్డాడు.
చివరికి బ్రతికిన తరువాత బ్రతుకు జీవుడా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.