మనిషికో పిచ్చి ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఈ పిచ్చి వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఊహించని కష్టాలు ఎదురవుతాయి.
దీనికి కారణం మనస్సు.ఇది అదుపులో పెట్టుకుంటే అంతా బాగుంటుంది.
లేదంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది.ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుంటే.
బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఓటు వేయడానికి వచ్చిన మాజీ సినీ నటి, తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తితో సెల్ఫీ దిగడానికి పోలింగ్ బూత్ ఆఫీసర్ అత్యుత్సాహం ప్రదర్శించారు.కానీ మొదట ఎంపీ మిమి చక్రవర్తి వారించి పోలింగ్ బూత్ లోనికి వెళ్ళి ఓటు వేసి బయటకు వస్తున్న క్రమంలో తన కోరికను ఆపుకోలేని పోలింగ్ బూత్ ఆఫీసర్ ఎట్టకేలకు సెల్ఫీ దిగాడు.
ఇక ఈ విషయం అధికారుల దృష్టికి వెల్లడంతో, ఆ పోలింగ్ ఆఫీసర్ ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించారని, ఈ ఘటన తెలియగానే అతన్ని తొలగించామని, అతని స్థానంలో మరో ఆఫీసర్ను డిప్యూట్ చేసినట్లు, జల్పాయిగురి డీఎం మౌమితా గోద్రా తెలిపారు.ఇకపోతే జాదవ్పూర్కు చెందిన ఎంపీ మిమి చక్రవర్తి గతంలో పాపులర్ సినిమా నటి అన్న సంగతి తెలిసిందే.