బెంగుళూరు లో ఒక జంట ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది.బెంగుళూరు లోని ఒక రద్దీ ప్రాంతంలో అందరూ ఉండగానే ఒక జంట భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అయితే ఆ సమయంలో చాలా మంది ప్రజలు అక్కడే ఉండగా అందరూ కూడా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు.అయితే అందరూ బిజీగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి దబ్ మని సౌండ్ రావడం తో అటుగా వెళ్లి చూడగా వారిద్దరూ రక్తపు మడుగులో ఉన్నారు.
అయితే ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడే పనులలో ఉండడం తో ఈ ఘటన లో వెంటనే స్పందించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.కానీ ఎలాంటి ప్రయోజనము లేదు.
ఆ ఇద్దరూ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అయితే అసలు వారిద్దరూ ఈ విధంగా చనిపోవడానికి కారణం ఏంటి, ఇది ఆత్మహత్య యేనా లేదా మరేదైనా కోణం ఉందా అన్న ఆలోచనతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబందించి ఒక వీడియో కూడా రికార్డ్ అయ్యింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.