బాలివుడ్ యువ నటుడు స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ గతనెల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఘటన జరిగి రెండు వారాలు కావస్తున్నా కూడా అతడి మృతి పై భిన్న కధనాలు వ్యక్తం అవుతున్నాయి.
అతడు అసలు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఏదైనా కారణం ఉందా అన్న విషయం పై ఇంకా స్పష్టత రాలేదు.దీనికి తోడు మరోపక్క సుశాంత్ మరణం వెనుక నెపోటిజం కారణం అంటూ నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.
అయితే ఇన్ని అనుమానాల మధ్య మరో సీనియర్ నటుడు,టెలివిజన్ హోస్ట్ శేఖర్ సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బాలీవుడ్లోని బంధుప్రీతి వల్ల సుశాంత్ మరణించలేదని.
ఇండస్ట్రీలోని గ్యాంగ్ల వల్లే అతడు ఆత్యహత్య చేసుకున్నాడంటూ ఆరోపించారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ను కలిసి సుశాంత్ మరణం గురించి చర్చించినట్టు శేఖర్ సుమన్ తెలిపారు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనక ఏదో కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది.దీని గురించి సీబీఐ విచారణ జరగాలి.
ఓ సిండికేట్, మాఫియా చిత్రపరిశ్రమను నడిపిస్తున్నాయి.ఇవే ఓ యువ నటుడి భవిష్యత్తును నాశనం చేశాయి.ఈ సిండికేట్లో భాగస్వాములైన స్టార్లందరు నాకు తెలుసు.కానీ, సరైన ఆధారాలు లేనందున వారి పేర్లు వెల్లడించడం లేదు అంటూ శేఖర్ వ్యాఖ్యానించారు.
సుశాంత్ గత నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 50 సిమ్ కార్డులు మార్చాడు.ఎవరి నుంచి తప్పించుకోవడం కోసం అతడు ఇలా చేశాడు.
వృత్తిపరమైన శత్రువులు ఎవరైనా ఉన్నారా అని తెలియాలి అంటూ శేఖర్ వ్యాఖ్యానించడం గమనార్హం.