టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కెరియర్ మొదట్లో ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షోలో పాల్గొని చివరికి అదే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.ఇలా ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతున్నటువంటి శేఖర్ మాస్టర్ ఢీ కార్యక్రమంలో ఎన్నో సీజన్లకు జడ్జిగా వ్యవహరించారు.
అయితే ఈయన ఉన్నఫలంగా ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.
అయితే శేఖర్ మాస్టర్ ఈ కార్యక్రమం నుంచి దూరం కావడానికి గల కారణం గురించి ఎన్నోసార్లు ఈయన ప్రస్తావిస్తూ స్టార్ మాతో అగ్రిమెంట్ కారణంగానే దూరమయ్యానని త్వరలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు.
అయితే చివరికి ఢీ షో నుంచి శేఖర్ మాస్టర్ తప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలియజేశారు.ఈ క్రమంలోని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా శేఖర్ మాస్టర్ ఈ విషయంపై మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
యాంకర్ ఓంకార్ గారితో తనకున్న అనుబంధం కారణంగానే ఆయన ఆహ్వానం మేరకే తాను స్టార్ మా కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు.ఇదే విషయాన్ని మల్లెమాల వారికి చెప్పగా ఇది డాన్స్ షో, అది కామెడీ షో ఇలా రెండు షోలలో పాల్గొన్న ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.అయితే ఓసారి మల్లెమాలవారు తనని స్టార్ మా నుంచి వెనక్కి వచ్చేయమని చిన్న ఇష్యూ చేశారు.ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తిరిగి వెళ్లడం ఎలా అని ఆలోచించి చివరికి ఢీ కార్యక్రమాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ అసలు విషయం వెల్లడించారు.