తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అకర్లేదు.శేఖర్ మాస్టర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఒకవైపు ఢీ,కామెడి స్టార్స్ వంటి షోలకు జెడ్జ్ గా వ్యవహారిస్తూనే సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా చేశారు.ప్రస్తుతం అగ్ర స్టార్ హీరోలందరికీ ఇప్పుడు శేఖర్ మాస్టరే కొరియోగ్రఫీ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే శేఖర్ మాస్టర్ తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలతో వర్క్ చేయలేదట.ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు ఒకరేమో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఈ ఇద్దరు స్టార్ హీరో లతో పని చేయకపోవడానికి గల కారణాలు తాజాగా ఒక ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చారు శేఖర్ మాస్టర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
నేను ప్రభాస్గారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయకపోవడానికి బలమైన కారణాలంటూ ఏమి లేవు.నిజానికి వారిద్దరితోనూ వర్క్ చేసే అవకాశం వచ్చింది.
కానీ మిస్ అయ్యింది.ప్రభాస్ సినిమా మిర్చి కి నాకు కొరియోగ్రాఫర్గా అవకాశం వచ్చింది.
వెళ్లి సెట్స్లో ప్రభాస్గారిని కలిశాను.ఆయనేమో కొరటాల శివ గారిని కలిపించారు.
ఆయనతో మాట్లాడిన తర్వాత ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం.అప్పటికింకా నేను కొరియోగ్రాఫర్గా ఎదుగుతున్నాను.
అందువల్ల కొరటాల శివగారు సుముఖత చూపించలేదపించింది అని తెలిపాడు శేఖర్ మాస్టర్.ఆ తర్వాత బాహుబలి సినిమాతో ప్రభాస్ గారు బిజీ అయ్యారు.అలా ప్రభాస్గారు తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.అందుకనే వర్క్ చేయలేదు అని చెప్పు కొచ్చాడు శేఖర్ మాస్టర్.అనంతరం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.భీమ్లా నాయక్ సినిమాకు నేను ఓ పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది.
నేను వెళ్లి డైరెక్టర్గారిని కలిశాను.డిస్కషన్ కూడా జరిగింది.
కానీ షూటింగ్ జరగాల్సిన సమయంలో మెయిన్ టెక్నీషియన్కి జ్వరం వచ్చింది.తర్వాత నేను మరో సినిమాతో బిజీగా ఉండటంతో కుదరలేదు అని చెప్పు కొచ్చారు శేఖర్ మాస్టర్.