టాలీవుడ్ ప్రేక్షకులకు డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరొకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షో లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు.
అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్నాడు.అయితే ఢీ షోకీ శేఖర్ మాస్టర్ జడ్జి గా వ్యవహరిస్తూ బుల్లితెరపై కూడా ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.
కానీ డీ షో మానేసిన తరువాత శేఖర్ మాస్టర్ క్రేజ్ బుల్లితెరపై తగ్గిపోయింది అని చెప్పవచ్చు.
ఇక ఢీ షో మానేసిన శేఖర్ మాస్టర్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో జడ్జి గా వ్యవహరిస్తున్నాడు.
అయినప్పటికీ ఆ షో అంతగా క్లిక్ అవ్వడం లేదు అని చెప్పవచ్చు.ఇక శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీతో డాన్స్ వీడియో లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.
అంతేకాకుండా యూట్యూబ్ లో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసి దాని ద్వారా కూడా పలు వీడియోలు చేస్తూ ఉంటాడు.ఇక శేఖర్ మాస్టర్ తన సొంత యూట్యూబ్ ఛానల్ లో టెర్రస్ అనే వెబ్ సిరీస్ ను కూడా నిర్మించారు.
ఇకపోతే శేఖర్ మాస్టర్ కూతురు గురించి మనందరికీ తెలిసిందే.ఆ మధ్య ఒక సారి ఈటీవీ నిర్వహించిన ఒక ఈవెంట్ లో సారంగదరియా పాటకు స్టెప్పులు ఇరగదీసింది.ఇది ఇలా ఉంటే శేఖర్ మాస్టర్ కూతురు పేరు మీద సోషల్ మీడియాలో కొన్ని నకిలీ ఖాతాలు పెడుతున్నారు అని తెలియడంతో వెంటనే రంగంలోకి దిగిన శేఖర్ మాస్టర్.తన కూతురు కోసం స్పెషల్ గా అఫీషియల్గా ఒక ఖాతా ను క్రియేట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే తన కూతురు తో కలిసి ఒక వీడియో ని కూడా షేర్ చేశాడు.ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.