శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటీనటులు గా నటించారు.
ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాగా బాగా ఆకట్టుకుంది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ లో తెరకెక్కనుంది.
ఈ సినిమాకు సంగీతాన్ని పవన్ సిహెచ్ అందించారు.
ఇక ఈ సినిమాలోని కొన్ని పాటలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో పక్క తెలంగాణ మాస్ తో వచ్చిన పాట ‘సారంగదరియా‘.ఈ పాట విడుదలైన క్షణంలోనే ఎన్నో లైక్ లను సొంతం చేసుకుంది.అంతేకాకుండా యూట్యూబ్ లో తెగ హల్ చల్ చేస్తుంది.ఇక ఈ పాట విడుదల అయిన తరువాత ఈ పాట గురించి పలు వార్తలు కూడా వినిపించాయి.
తాజాగా ఈ పాట పై కొన్ని వివాదాలు ఎదురుగా కాగా ఈ పాటను నేనే వెలుగులోకి తీసుకు వచ్చానంటూ గాయని కోమలి తెలిపింది.ఇటీవలే మీడియాతో మాట్లాడగా లవ్ స్టోరీ సినిమా లో నేను వెలుగులోకి తీసుకు వచ్చిన పాటని నాతో పాడిస్తామని చెప్పి.
పాటించలేరని తెలిపింది.ఇక ఈ విషయం గురించి స్పందించిన దర్శకుడు ఓ విషయాన్ని తెలిపాడు.
చాలా ఏళ్ళ కిందట రేలా రే రేలా ప్రోగ్రాంలో ఈ పాటను శిరీష అమ్మాయి పాడిందని ఇప్పటికీ ఆ పాట నా మనసులోని తిరుగుతూనే ఉందని తెలిపాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.
ఇక ఈ పాటను లవ్ స్టోరీ సినిమా కు తగ్గట్టుగా రాయమని సుద్దాల అశోక్ తేజ గారిని కోరారట.ఇక ఆయన ఆ పాట పల్లవి తీసుకొని కొన్ని మార్పులు చేసి చరణాలు రాశారట.ఈ పాటను శిరీష తో పాడిద్దామని అనుకోగా.
ఈ పాట తొలుత కోమలి నుండి వచ్చింది కాబట్టి తనతో పాడిద్దామని సుద్దాల గారు అన్నారని తెలిపారు.దీంతో ఆమెను వరంగల్ నుండి రమ్మని కోరగా ఆమె జలుబు, దగ్గు ఉండటం వల్ల రాలేనని తెలిపారని చెప్పుకొచ్చారు దర్శకుడు.
ఇక ఆ సమయంలో చెన్నై నుంచి వచ్చిన సంగీత దర్శకుడు రికార్డింగ్ కోసం వచ్చి ఉండటంతో సింగర్ మంగ్లీ తో పాడించామని తెలిపాడు.కానీ ఆ పాట క్రెడిట్ తో పాటు డబ్బులు కూడా ఇస్తామని కోమలికి చెబితే ఆమె ఒప్పుకుందట.
కానీ పాట విడుదల తర్వాత ఆమె చేసిన చర్చలు డైరెక్టర్ ఇంతవరకు చూడలేదని తెలిపాడు.ఇక డైరెక్టర్ ఈ క్రెడిట్ తప్పకుండా ఆమెకు ఇవ్వడంతో డబ్బులు కూడా ఇస్తామని తెలిపాడు.
అంతేకాకుండా ఆడియో వేడుకలో కూడా తనతో పాట పాడిస్తానని తెలిపాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.