టాలెంటెడ్ దర్శకుడుగా, ఫీల్ గుడ్ సినిమాలని తెరకెక్కించే అతి కొద్ది మంది దర్శకులలో ఒకరిగా శేఖర్ కమ్ముల టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా సినిమాలు చూస్తే అతని స్టైల్ ఏంటి అనేది అందరికి తెలుస్తుంది.
సినిమాలో కథ కంటే, క్యారెక్టర్స్, వాటి చుట్టూ పండించే ఎమోషన్స్ తో కథనాన్ని నడిపిస్తూ సక్సెస్ సాధించడం అంటే అంత తేలికైన విషయం కాదు.ఈ విషయంలో శేఖర్ కమ్ముల తన టాలెంట్ చూపిస్తున్నారు.
ఆయన సినిమాలలో పాత్రలు, వాటి ప్రయాణం మాత్రమే కనిపిస్తుంది తప్ప ట్విస్ట్ లు, ఇంటరెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, యాక్షన్ సీన్స్, థ్రిల్లర్ అంశాలు ఏవీ కూడా ఉండవు.అలాగే అతని సినిమాలలో ప్రతినాయక పాత్రలు కూడా పెద్దగా కనిపించవు.
కేవలం పరిస్థితులని మాత్రమే ప్రతినాయక పాత్రలో ప్రెజెంట్ చేస్తూ ఉంటాడు.ఈ కారణంగానే చాలా మంది శేఖర్ కమ్ముల సినిమాలు ఇష్టపడుతూ ఉంటారు.
ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా లవ్ స్టొరీ అనే సినిమాతో శేఖర్ కమ్ముల త్వరలో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఉంది.
ఫిదా తర్వాత సాయి పల్లవితో చేస్తున్న సినిమా కావడంతో పాటు ఫిదా తరహాలోనే లవ్ స్టొరీలో సారంగాదరియా సాంగ్ సెన్సేషన్ హిట్ అవ్వడం ఇప్పుడు సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కమ్ముల మరోసారి మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే కథ కూడా చెప్పడం జరిగిందని, వరుణ్ తేజ్ కూడా ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం.ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా ఆరుళ్ మోహన్ ని ఖరారు చేసారని టాక్ నడుస్తుంది.
ఇందులో వాస్తవం ఎంత అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు తెలియదు.