ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా సినిమాలతో టాలీవుడ్ లో కొత్త ప్రేమ కథలను తెరకెక్కించిన శేఖర్ కమ్ములకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.ఈయన సినిమాలంటే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే విధంగా ఉంటాయి.
ఈయన ప్రేమ కథలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉంది.మనసుకు హత్తుకునేలా తీయగలిగే సత్తా ఉంది.
ఈయన సినిమాల్లో హీరోయిన్ పాత్ర కేవలం గ్రామర్ రోల్ కు మాత్రమే కాకుండా బలమైన క్యారెక్టర్స్ ఉంటాయి.ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాకు దాదాపు 35 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.ఈ చిత్రం పై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా నుండి రిలీజైన సారంగదరియాసాంగ్ తో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.ఈ సాంగ్ మాత్రమే కాదు ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాను ఏప్రిల్ 16 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల చేయబోయే సినిమా గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ జోడీతో సినిమా చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది.ఇది కూడా ప్రేమ కథతోనే తెరకెక్కబోతుంది సమాచారం.
ఈ సినిమాలో హీరోగా వైష్ణవ్ తేజ్ పేరు వినిపిస్తుంది.ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ప్రియాంక అరుళ్ మోహన్ నటించబోతున్నట్టు టాక్ నడుస్తుంది.
అయితే హీరో హీరోయిన్స్ ఇద్దరు ప్రస్తుతం బిజీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ సినిమాలు అన్ని పూర్తయిన తర్వాతే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.