రౌడీ బేబీ సాయి పల్లవి క్రేజ్ ప్రస్తుతం ఒక రేంజ్ లో ఉంది.ప్రత్యేకంగా ఆమె కోసం సినిమాకి వెళ్లే ప్రేక్షకులు టాలీవుడ్ లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ప్రేక్షకులలో తన మీద ఉన్న గుడ్ విల్ కి తగ్గట్లుగానే ఆమె కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉంది.ప్రస్తుతం ఈ భామ నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేస్తుంది.
ఫిదాతో తనకి టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ అందించిన శేఖర్ కమ్ముల చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో మరోసారి చేయడానికి రెడీ అయ్యింది.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.
దీంతో పాటు రానాతో కలిసి విరాటపర్వం అనే సినిమాలో చేస్తుంది.ఇందులో ఒక గిరిజన యువతి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది.
ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా సాంగ్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల ఫిదా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని లవ్ స్టోరీ చేస్తున్నారు.అయితే ఈ మధ్య తెలుగులో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ ఉండటంతో లవ్ స్టోరీ కూడా డిజిటల్ లోనే రిలీజ్ అవుతుందని అందరూ భావించారు.
అమెజాన్ ప్రైమ్ తో ఈ సినిమా గురించి చర్చలు కూడా జరిగినట్లు టాక్ వచ్చింది.అయితే నిర్మాతలు మాత్రం డిజిటల్ రిలీజ్ పై ఆసక్తి చూపించలేదు.అలాగే నాగ చైతన్య కూడా ఓటీటీ రిలీజ్ కి నో చెప్పడం తో థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు.ప్రస్తుతం థియేటర్స్ తిరిగి ప్రారంభించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
దీనిపై త్వరలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.