టాలీవుడ్లో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా చిత్రంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.ఈ డైరెక్టర్ ప్రస్తుతం తెరకెక్కిస్తు్న్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఫిబ్రవరిలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని అప్పట్లో చిత్ర యూనిట్ తెలిపింది.
కానీ షూటింగ్ ఆలస్యమవుతుండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఏప్రిల్లో ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.
అయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా రిలీజ్ను మరోసారి వాయిదా వేశారు చిత్ర యూనిట్.ఈ సినిమాను మే 29న రిలీజ్ చేసేందుకు ‘లవ్ స్టోరి’ టీమ్ రెడీ అయ్యింది.
మరి ఈసారైనా అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేస్తారా లేక మళ్లీ వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు శేఖర్ కమ్ముల.
మరి లవ్ స్టోరి చిత్రం ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.