సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సిటీ మార్ అనే సినిమా చేశాడు.రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
రచ్చ సినిమా తర్వాత సంపత్ నంది ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో కమర్షియల్ హిట్ అందుకోలేకపోయాడు.బెంగాల్ టైగర్ మూవీ కమర్షియల్ సక్సెస్ అయిన కూడా రొటీన్ రివేజ్ డ్రామాగా మిగిలిపోయింది.
తరువాత గోపీచంద్ తో గౌతమ్ నందా సినిమా చేశారు.ఈ సినిమాలో గోపీచంద్ డ్యూయల్ రోల్ లో కనిపించాడు.
ఇది కూడా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు.అయితే గోపీచంద్ మరోసారి సంపత్ నందితో సినిమా చేయడానికి ఒకే చెప్పి సిటీ మార్ చేశారు.
కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు.తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇక ఆమె జ్వాలారెడ్డి అనే డేరింగ్ అండ్ డాషింగ్ కోచ్ పాత్రలో కనిపించబోతుంది.అలాగే గోపీచంద్ కూడా కోచ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది.ఈ సినిమా మీద అంచనాలు కూడా భాగానే ఉన్నాయి.
దీంతో కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ అందుకొని తిరిగి ట్రాక్ లోకి రావాలని అటు గోపీచంద్, ఇటు సంపత్ నంది కూడా భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో థియేటర్స్ రిలీజ్ కోసమే వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఒటీటీ నుంచి అదిరిపోయే ఆఫర్ రావడంతో నిర్మాత డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ విషయంలో సంపత్ నంది మాత్రం థియేటర్స్ రిలీజ్ కోసం ఆసక్తి చూపిస్తున్నాడని టాక్.
సినిమా మీద గట్టి నమ్మకంతో ఉండటంతో థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ఒటీటీ ఆఫర్ కంటే ఎక్కువ కలెక్షన్ వస్తుందని సంపత్ నంది నిర్మాతకి చెబుతున్నట్లు బోగట్టా.ఇక ఈ విషయంలో దర్శక, నిర్మాతలు ఇద్దరూ కూడా ఆలోచనలో పడ్డారని సమాచారం.
అయితే థియేటర్స్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉన్న నేపధ్యంలో అంత వరకు వెయిట్ చేయాలంటే సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్ వడ్డీలు పెరిగిపోయి బడ్జెట్ మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఒటీటీకి వెళ్ళడం బెటర్ అని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
.