‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లను అందుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత ‘కుమారి 21ఎఫ్’ మరియు ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకున్నాడు.ఈ రెండు చిత్రాల్లో ‘కుమారి 21ఎఫ్’ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకుంది.
రాజ్ తరుణ్ కెరీర్ను ఒక్కసారిగా మలుపు తిప్పిన ‘కుమారి 21ఎఫ్’ భారీ వసూళ్లను రాబడుతూ చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించే వైపుగా దూసుకు పోతుంది.ఈ క్రమంలో ఈయన నటిస్తున్న ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడే అవకాశాలున్నాయి.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చాలా సాదా సీదా కథాంశంతో తెరకెక్కుతోంది.ఈ సినిమా రాజ్ తరుణ్కు ఎలాంటి గుర్తింపును తేక పోగా ‘కుమారి 21ఎఫ్’ చిత్రం ద్వారా వచ్చిన ఇమేజ్ను దెబ్బ తీయడం ఖాయం అని అంటున్నారు.
కుమారికి ముందు ఈ సినిమా వచ్చినా బాగుండేదని ఇప్పుడు రాజ్ తరుణ్ చింతిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.కుమారి వల్ల పెరిగిన క్రేజ్ ఈ సినిమా వచ్చి ఫ్లాప్ అయితే తగ్గే అవకాశాలున్నాయని రాజ్ తరుణ్ ఆందోళన చెందుతున్నాడు.
ఇప్పుడు ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నానుర బాబోయ్.అని రాజ్ తరుణ్ భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా సక్సెస్ కాకపోయినా పర్వాలేదు కాని ఫ్లాప్ కాకుండా యావరేజ్గా ఉంటే చాలు అని రాజ్ తరుణ్ కోరుకుంటున్నాడు.
ఈ సినిమాతో ఆర్తన హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.