రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సీరత్ కపూర్.మొదటి సినిమా సూపర్ హిట్ అయిన తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్న స్థాయిలో క్రేజ్ రాలేదని చెప్పాలి.
అప్పుడప్పుడు తన హాట్ ఫోటోషూట్ లతో ఇన్స్టాగ్రామ్ లో అందాల జాతర చేసిన సీరత్ కపూర్ ని టాలీవుడ్ లో పెద్ద దర్శకులు ఎవరూ పట్టించుకోవడం లేదు.పెద్ద హీరోలలో రవితేజతో టచ్ చేసి చూడు సినిమా మాత్రమే సీరత్ చేసింది.
మిగిలినవి అన్ని కూడా చిన్న హీరోల సినిమాలే.అయితే ఈ బ్యూటీ చేసిన సినిమాలు చిన్నవే అయినా హిట్ టాక్ తెచ్చుకున్నవే.
చివరిగా కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాఢ వినుమా అని రెండు సినిమాలు సిద్దుతో కలిసి చేసింది.ఈ రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చింది.
డిజిటల్ చానల్స్ ద్వారా ఇవి రిలీజ్ అయ్యాయి.
దీంతో థియేటర్ ప్రేక్షకులకి చేరువ కాలేకపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా సీరత్ కపూర్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది అనే విషయాన్ని చెప్పుకొచ్చింది.జిద్ అనే సినిమాతో బాలీవుడ్ నుంచే హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మారిచ్ అనే హిందీ సినిమా చేస్తుంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకి అన్ని జోనర్స్ లో సినిమాలు చేయడంతో పాటు ఆ కథ నేటివిటీకి తగ్గ పాత్రలు చేయడం అంటే ఇష్టం అని చెబుతుంది.ప్రత్యేకించి పీరియాడిక్, రొమాన్స్, యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా కథాంశాలంటే ఎంతో ఇష్టమని చెప్తోంది.
నాకు నటిగా వివిధ పాత్రల్లో నటించాలని ఉంది.పీరియాడిక్ చిత్రాలు ఆసక్తికరంగా ఉంటాయి.
టైం వృధా చేయకుండా డిఫరెంట్ స్టోరీల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.అంతేకాదు లవ్ స్టోరీల్లో కూడా నటించాలని ఉంది.
యాక్షన్ థ్రిల్లర్ తోపాటు క్రీడా నేపథ్యంలో కథలు వస్తే కూడా చేస్తా.స్క్రిప్ట్ నచ్చితే హీరోలు ఎవరనేది కూడా నాకు అనవసరం అని సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
మొత్తానికి ఈ అమ్మడు డ్రీమ్స్ గట్టిగానే ఉన్నాయి.మరి దానికి తగ్గ పాత్రలు వస్తాయా లేదా అనేది చూడాలి.