మామూలుగా మనం ఎక్కడైనా సరే మహిళలకు శ్రీమంతం కార్యక్రమాలు చేస్తూ ఉండడం గమనిస్తూనే ఉంటాం.మహిళలు నిండు గర్భిణిగా ఉన్న సమయంలో వారికి ఘనంగా శ్రీమంతం జరిపించి తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని దీవిస్తారు.అయితే తాజాగా విజయవాడ లోని పాయకాపురం ప్రాంతంలో నివసిస్తున్న జానా రెడ్డి అనే వ్యక్తి తన నివాసంలో ఉండే గోమాతకు నెలలు నిండడంతో ఆ గోమాతకు శ్రీమంత కార్యక్రమం జరిపించారు.
అవును… గోమాతకు శ్రీమంతం చేశారా అని ఆశ్చర్యమేస్తుంది కదా.? అవును నిజమే జానారెడ్డి నివాసంలో ఉన్న గోమాతకు వారి కుటుంబ సభ్యులతో సహా స్థానిక పెద్దలను ఆహ్వానించి ఘనంగా శ్రీమంతం చేయించాలని ఆలోచన చేశాడు.అందుకు తగ్గట్టుగానే హిందూ సాంప్రదాయం ప్రకారం అర్చకుల ద్వారా గోమాతకు చీర, జాకెట్, పూలు, పండ్లు అన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక ఈ శ్రీమంతం కార్యక్రమానికి ఆ ప్రాంతంలో కొందరు స్థానికులు వారి ఇంట్లో స్వయంగా అనేక పిండి పదార్థాలు, చలివిడి గోమాతకు తినిపించి గోమాత దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతను హిందువులు ఏ విధంగా పూజిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ముల్లోకాల్లో ఉన్న దేవతా మూర్తుల అందరూ గోమాతలో ఉంటారని హిందువుల నమ్మకం.