ఒకప్పుడు దొంగతనం చేయాలంటే ఏ మాత్రం భయం లేకుండా చేసేవారు.అప్పుడు ప్రజలు దొంగలంటే భయపడే వారు.
ఎందుకంటే అప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే మాత్రమే దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులకు అవకాశం ఉండేది.ఒక్కసారి ఒక్క కాలనీలో దొంగతనం జరిగిందంటే ఇక ఆ కాలనీ వారు ఎవరూ రాత్రి పూట బయట తిరిగే ధైర్యం చేయరు.
అలా ఉండేది కొన్నేళ్ల క్రిందటి పరిస్థితి.కాని ప్రస్తుతం సీన్ రివర్స్ గా మారిపోయింది.
ఇప్పుడు దొంగతనం చేయాలంటే దొంగలు జంకుతున్నారు.ఒకవేళ ధైర్యం చేసి దొంగతనం చేస్తే ఇక ఆ దొంగ పట్టుబడటం ఖాయం.
ఎందుకంటే ఇప్పుడు సీసీ కెమెరాలు ఇలా చాలా పటిష్ట భద్రత ఉండటంతో దొంగతనాలు చేయడానికి జంకుతున్న పరిస్థితి ఉంది.ఇక ఇలాంటి పరిస్థితులలో ఇక దొంగలు తమ దొంగతనాలు చేయడంలో వినూత్న పద్దతులను ఎంచుకుంటున్నారు.
ఈక్వెడార్ దేశంలో ఈ వినూత్న దొంగతనం ఘటన చోటు చేసుకుంది.ఓ రిపోర్టర్ లైవ్ లో మాట్లాడుతుండగా ఓ దొంగ లైవ్ జరుగుతుందని ఏమాత్రం భయపడకుండా తుపాకీతో రిపోర్టర్ ను, కెమెరామెన్ ను బెదిరించి మొబైల్ ఫోన్లు, పర్సులను లాక్కొని వెళ్ళిపోయాడు.
ఇదంతా కెమెరామెన్ కెమెరాలో రికార్డ్ అయింది.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.
పట్టపగలే భయం లేకుండా దొంగతనం చేస్తున్న దొంగలు ఇదొక కొత్త పద్దతిని ఎంచుకున్నారని నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.
.