ఈ విశాల భూ ప్రపంచంలో తల్లికి మించిన యోధులు ఎవరు లేరన్నది అందరూ ఒప్పుకుని తీరాల్సిన సత్యం.తల్లి ప్రేమ గురించి, ఆమె గొప్పతనం గురించి అనేక సినిమాల్లో ప్రస్తావించారు.
ఎన్నో హిట్ డైలాగులు, పాటలు కూడా మనకు వినిపిస్తాయి.తన గురించి ఆలోచించకుండా తన పిల్లల క్షేమం కోసం మొండిగా ఎదురెళ్లి నిలబడేది కేవలం తల్లి మాత్రమే.
తల్లి ప్రేమకు చాలా మంది ఫిదా అయిపోయి తమకు తోచిన రూపంలో విషెస్ తెలియజేస్తుంటారు.సోషల్ మీడియాలో కూడా తల్లి ప్రేమను గురించి చెప్పే ఎన్నో అద్భుత వీడియోలు ఉన్నాయి.
ఇంకా వస్తూనే ఉంటాయి.అలా ప్రస్తుతం ఒక ఒపోసమ్… తన ఐదు పిల్లలను తన వీపు మీద ఎక్కించుకుని చిన్న పిట్ట గోడ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచే వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
అది చూసిన వారందరూ తల్లి ప్రేమ కు ఈ లోకంలో మరేదీ సాటిరాదని చెబుతున్నారు.
తన ఐదు పిల్లలను వీపుపై ఎక్కించుకుని జాగ్రత్తగా ఈ ఒపోసమ్ గోడ మీద నుంచి నడిచే తీరును చూసిన నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు.
తనకు ఎంతలా బాధ కలిగినా కానీ తన పిల్లలను మాత్రం వదిలిపెట్టకుండా తీసుకెళ్తూ ఉంటుంది.
నిజ జీవితంలో కూడా తల్లులు అలాగే తమ పిల్లల కోసం ఎంతటి దు:ఖాన్నైనా పళ్ల బిగువును దాచుకుని పోరాటాలు చేస్తుంటారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఇండియన్ అటవీ శాఖ అధికారి ఒకరు ఈ వీడియోను షేర్ చేశారు.
ఇది చూసిన నెటిజన్లు లైకులు, షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదని చెబుతున్నారు.
తల్లి ప్రేమ ముందు మిగతావన్నీ చిన్నవిగా కనిపిస్తాయని అంటున్నారు.