కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ రాష్ట్రపతి చేతుల మీదుగా గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఆర్టికల్ రద్దు పై దేశం లో పలు పార్టీలు సంబరాలు చేసుకుంటున్న విషయం విదితమే.
అయితే ఈ ఆర్టికల్ రద్దు కారణంగా ఎలాంటి పరిణామాలు అయినా చోటుచేకోవచ్చు సుకోవచ్చు అన్న ఉద్దేశ్యంతో కేంద్రం ఇప్పటికే భారీ గా అక్కడ బలగాలను మోహరించింది.అయితే నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్ లో ఎటాక్ జరగవచ్చు అని తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది.
దీనితో దేశవ్యాప్తంగా 19 ఎయిర్ పోర్టులను కేంద్ర హోంశాఖ అలర్ట్ చేయడం తో విమాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలనీ ఆదేశించింది.మరోపక్క ఈ ఉగ్రముప్పు హెచ్చరికలతో పంజాబ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది.వివిధ జోన్లలో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
పంజాబ్లో జైషే, లష్కరే ఉగ్ర మూకలు ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.భారత్ పాక్ సరిహద్దుల్లో వారం క్రితం కొందరు టెర్రరిస్టుల కదలికలను పసిగట్టినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు పంపడం తో అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నారు.