ఓ ప్రబుద్ధుడు తాను పనిచేస్తున్న బ్యాంకు కు కన్నం వేయాలని మాస్టర్ ప్లాన్ వేశాడు.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… హర్యానా రాష్ట్రంలోని మొహాలి జిల్లాలో ఉన్న పార్చ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆ ఊర్లోని యాక్సిస్ బ్యాంక్ సంబంధించి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బలిజిత్ సింగ్ బ్యాంకు ఉద్యోగుల నుంచి ఏకంగా పది లక్షల 44 వేల ను లూటీ చేశాడు.అయితే ఆ తర్వాత ఇందుకు సంబంధించి పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని కేవలం 24 గంటల్లో అరెస్టు చేశారు.
శుక్రవారం బ్యాంకు నడిచే సమయంలో సుమారు 11 గంటల సమయంలో బ్యాంకు డిప్యూటీ మేనేజర్ క్యాషియర్ అసిస్టెంట్ మేనేజర్ బ్యాంకు పని నిమిత్తం వారు బయటికి వెళ్లారు.అయితే ఈ సమయాన్ని ఆసరా చేసుకుని తన కుమారుడి ఆరోగ్యం సరిగా లేదని బయటికి వెళ్లి మందులు తీసుకువస్తానని బయటికి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత బ్యాంకు లోకి మాస్కు ధరించి ఓ వ్యక్తి తుపాకీ తీసుకొని ప్రవేశించాడు.ఇక బ్యాంకు లోనే మేనేజర్, ఓ ప్యూన్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో అతను వారిని బెదిరించి క్యాష్ బాక్స్ తో అతను పారిపోయాడు.
అయితే అందుకు సంబంధించి బ్రాంచ్ మేనేజర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారి స్టైల్లో ప్రశ్నించడంతో బలిజిత్ సింగ్ నేరం ఒప్పుకున్నాడు.దాంతో అతని వద్ద నుండి పోలీసులు అతను తీసుకువెళ్లిన నగదుతో పాటు ఓ నాటు తుపాకీని, మరో కాట్రిడ్జ్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు.