హైదరాబాద్ నగరం కుకట్ పల్లి ప్రాంతం వద్ద ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ఆలీ అనే వ్యక్తిని దుండగులు కాల్చిచంపారు.సరిగ్గా ఏటీఎంలో డబ్బులు లోడ్ చేస్తున్న సమయంలో దోపిడీకి పాల్పడుతు విచక్షణ రహితంగా తుపాకులతో దాడి చేయడం జరిగింది.
పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
సరిగ్గా మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే ఇద్దరు సెక్యూరిటీ గార్డుల పై కాల్పులు జరిపి.
నగదు ఎత్తుకెళ్లి పోవడం జరిగింది.పట్టపగలు హైదరాబాద్ నడిబొడ్డున ఈ రీతిగా కాల్పులు జరగడంతో అక్కడ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భయం ఆందోళన చెందారు.
కాల్పులు జరిపిన దుండగులు 25 సంవత్సరాల లోపు కలిగినవారని తాజా సమాచారం బట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు.కుక్కట్ పల్లి ఆల్విన్ రోడ్డు లో హెచ్డిఎఫ్ సి ఎటిఎం దగ్గర.
ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డుల లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందటంతో మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
దీంతో దుండగులను పట్టుకోవడం కోసం పోలీసులు గాలింపు చర్యలు స్టార్ట్ చేశారు.