సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఊహించని షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ..!!

కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పంచాయతీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ పెంచారు.ఇదే క్రమంలో తనకి అడ్డుగా వచ్చిన ఉద్యోగ సంఘాలకు కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చే రీతిలో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ తాజాగా గ్రామ సచివాలయ సిబ్బంది అదేవిధంగా వార్డు వాలంటీర్లకు ఊహించని షాక్ ఇచ్చారు.

 Grama Sachivalayam,volunteers,local Elections,nimmagadda Ramesh Kumar, Nimmagadd-TeluguStop.com

మేటర్ ఏమిటంటే పంచాయతీ ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగస్తులు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు తిరిగి ఇచ్చేయాలని అలాగే వాలంటీర్ల అందరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ పాల్గొనకూడదు అంటూ ఊహించని షాక్ ఇస్తూ సరికొత్త ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉన్నంత కాలం ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.ఇదే క్రమంలో మరోపక్క అన్ని జిల్లాల కలెక్టర్లతో మరియు ఎస్పీలతో నిమ్మగడ్డ రేపు సమావేశం కానున్నారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube