తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి రాజకీయ అపర చాణక్యుడు అనేది మనకు తెలిసిందే.కేసీఆర్ తాను వేసే వ్యూహాన్ని ఎప్పుడూ బయట పెట్టడు.
అది అమలు అయ్యే వరకు తన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా వ్యూహాన్ని బహిర్గతం చేయని నైజం కేసీఆర్ కు ఉంది.అయితే ఇప్పటికే అప్పటి రాజకీయ వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి చాలా తేడా ఉంది.
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావడం, బీజేపీ తెలంగాణలో మరింతగా బలపడటం ఇదంతా కేసీఆర్ కు అతి పెద్ద సవాల్ గా మారనున్నది.అయితే ఈ పరిస్థితి కేసీఆర్ ముందుగా ఊహించిందే.
అందుకే ఇప్పుడు అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా కార్యాచరణ చేపడుతున్న పరిస్థితి ఉంది.
దళిత సాధికారిత పథకం, చేనేత కార్మికులకు రైతు బీమా తరహా లాంటి పథకం, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఆకస్మిక తనిఖీలకు పూనుకోవడం ఇదంతా ప్రజల దృష్టి తనపై ఉండానికి కేసీఆర్ వేసే వ్యూహం.
ఏది ఏమైనా ప్రతిపక్షాలకు కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తే ఇక గడ్డు కాలమనే చెప్పవచ్చు.ఏది ఏమైనా ఇది ఉత్కంఠ కలిగించే అంశం అని చెప్పవచ్చు.
మరి ప్రతిపక్షాలు కెసీఆర్ కు ధీటుగా ప్రతి పక్షాలు ఎటువంటి వ్యూహాలు రచిస్తారో మనం అని చెప్పవచ్చు.