ప్రపంచంలో జరిగిన డిస్కవరీసన్నీ యాదృచ్ఛికంగా జరిగినవే ఆ డిస్కవరీస్ లో మన పూర్వీకులు మన సంప్రదాయాలు గొప్పతనం గురించి తెలిపే ఎన్నో అద్భుతాలకు సంబంధించిన వస్తువులు బయటపడ్డాయి.అవి మన పూర్వీకులు వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనాలుగా నిలిచాయి.
అలాంటివి యాదృచ్ఛికంగా బయట పడేంతవరకు చూస్తూ కూర్చోకుండా వాటిని కనిపెట్టడానికి ప్రపంచ దేశాలు ప్రత్యేక విభాగాలు ఏర్పరిచి మన పూర్వీకులు వాడిన అతి ప్రాచీనమైన సాంకేతిక పరిజ్ఞానం మూలాలను, అలాగే మన పూర్వీకుల గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం అయిన కట్టడాలను కనిపెట్టేందుకు కృషి చేస్తున్నారు.ఇక తాజాగా ఇలాంటి ఓ అరుదైన కట్టడం మన దేశంలో అది కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఒకటి బయటపడింది.
దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.
సముద్రపు అలలతో సుందరమైన సాగర్ అందాలతో మనల్ని కనువిందు చేసే విశాఖ బీచ్ లో తాజాగా రెండు ప్రపంచ యుద్ధ సమయంలో కాంక్రీట్ తో నిర్మించిన ఓ బంకర్ బయటపడింది.
ఇది రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఇసుక మేటలతో నిండిపోయింది.తాజాగా విశాఖలో అలల తాకిడి పెరగడంతో ఇసుక కరిగి ఇలా ఓ బంకరు దర్శనమిచ్చింది.ప్రస్తుతం పర్యాటకులు ఈ బంకరు పై నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు
.