ప్రస్తుతం దేశంలో కరోనా తన దిశను మార్చుకుందట.గత సంవత్సరం పెద్దవారికి ప్రాణసంకటంగా మారిన కోవిడ్ ఈ సంవత్సరం మాత్రం సెకండ్ వేవ్గా రిలీజ్ అయ్యి చిన్నారులపై విపరీతంగా ప్రభావం చూపిస్తుందట.
ఇక ఐదు రాష్ట్రాల్లోని 79,688 మంది చిన్నారులు మార్చి నుండి ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడ్డారని, తొలి దశలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని మాత్రమే బలిగొన్న కరోనా మహమ్మారి, ఇప్పుడు అన్ని వయసుల వారినీ బాధిస్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు.ఇదిలావుండగా ఛత్తీస్ గఢ్ లో 6,940 మంది చిన్నారులకు వ్యాధి సోకగా, వారిలో 922 మంది ఐదేళ్లలోపు వారే ఉన్నారట.
అదీగాక ఇండియాలో మార్చి 1 నుంచి ఏప్రిల్ నాలుగు మధ్య 60,684 మంది చిన్నారులు కరోనా బారిన పడగా, వారిలో 9,882 మంది ఐదేళ్లలోపు చిన్నారులు కావడం గమనార్హం.ఇక దేశ రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొని వుందట, ఈ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, యూపీల్లో సైతం దాదాపు 1200 మందికి పైగా ఐదేళ్లలోపు పిల్లలు కరోనా బారిన పడ్డారని వైద్యులు తెలియచేస్తున్నారు.
ఇలా చిన్నపిల్లలకు ప్రస్తుతం కోవిడ్ టీకా అందుబాటులో లేకపోవడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తుందని తెలుస్తుంది.కాబట్టి చిన్నారుల విషయంలో తగినంతగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం.