తెలంగాణ టీడీపీ తన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీటీడీపీ.
తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి గణేష్ గుప్తా పేర్లను ప్రకటించింది.
ఈ మేరకు టీటీడీపీ ప్రకటన విడుదల చేసింది.ఇప్పటికే కాంగ్రెస్ 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.
టీటీడీపీ మొత్తంగా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.టీజేఎస్ కూడా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఇక సీపీఐ తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.నామినేషన్ ల గడువు ముంచుకు వచ్చేస్తుండడంతో మహాకూటమిలోని పార్టీల సీట్ల ప్రకటన వేగం పుంజుకుంది.
తాజా వార్తలు