ప్రముఖ యోగ గురువు రామ్ దేవ్ బాబా గురించి చాలా మందికి తెలుసు.ఆయన తాజాగా తన యోగ తరగతుల్లో ఆర్ధిక పాఠాలు చెప్పారట.
అయితే ఈ ఆర్ధిక పాఠాలు అతడిని చిక్కుల్లో పడేస్తాయని అనుకోలేదు.అతడు యోగ క్లాసులకు వచ్చిన వారికీ కోతీశ్వరులయ్యే మంత్రం చెప్పాడట.
కానీ ఈ మంత్రం కారణంగా ఆయనకు నోటీసులు అందాయట.
ఇటీవలే ఆయన చెప్పే యోగ క్లాసుల్లో రామ్ దేవ్ బాబా కోటీస్వరులయ్యే మంత్రం తన దగ్గర ఉందని మీరు జాగ్రత్తగా వినండి అంటూ చెప్పాడట.
ఇంతకీ ఆ కోతీశ్వరులయ్యే మంత్రం ఏమయ్యుంటుందా అని ఆలోచిస్తున్నారా.అదే డీ మ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని యోగ క్లాసులకు వచ్చిన వారికీ చెప్పాడట.
అంతేకాదు రుచి సొయా కంపెనీకి చెందిన షేర్లు కొని వీటిని తిరిగి అమ్మకుండా వెంటనే సమాధి చేయాలనీ చెప్పారు.ఎక్కువ కాలం అలా మీ దగ్గరే ఉంచుకుంటే పతంజలి తర్వాత లక్ష కోట్ల రూపాయల కంపెనీ అయ్యే అన్ని అర్హతలు రుచి సోయాకు ఉన్నాయని చెప్పారు.
అయితే ఈ విషయంపై సెబీ (సెక్యూర్టీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా) సీరియస్ అయ్యింది.సెబీ నిబంధనలు ప్రకారం మార్కెట్ పై అవగాహనా లేని వారికీ ఇలాంటి సలహాలు ఇవ్వకూడదట.
దీనివల్ల వీరు డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది.కానీ రామ్ దేవ్ బాబా వీటి గురించి పట్టించుకోకుండా బహిరంగంగానే ఇలాంటి సలహాలు ఇవ్వడంపై సెబీ సీరియస్ అవుతుంది.ఈ విషయంపై రామ్ దేవ్ బాబా వివరణ ఇవ్వాలని కోరుతుంది.రామ్ దేవ్ బాబా చేసిన కామెంట్స్ వల్ల రుచి సొయా సంస్థ చిక్కుల్లో పడింది.రామ్ దేవ్ బాబాతో పాటు రుచి సంస్థకు కూడా సెబీ నోటీసులు జారీ చేసింది.
ఆయన యోగ క్లాసులు చెబుతుండగా కొంతమంది వీడియో తీసి అది సెబీ కి పంపించారు.నోటీసులు అందించిన తర్వాత ఈ వీడియోను డిలేట్ చేసారని సమాచారం.అయితే రామ్ దేవ్ బాబా ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.