మనం పొలాల్లోకి వెళ్లినప్పుడు అక్కడ ఉండే పురుగూ పుట్రా వంటివి తినే పక్షులను చూసి ఉంటాం.డాబాపైనా ఏవైనా ఆరబెడితే చప్పుడు చేయకుండా వాటిని ఆరగించే పక్షులను కూడా గమనించి ఉంటాం.
ఇంకొన్ని సందర్భాలలో నదిపైనే, చెరువు వద్దనో గాలిలో ఎగురుతూ, అమాంతంగా కిందికి వచ్చి చేపలను నోట కరచుకునే పక్షులను కూడా చూసి ఉంటాం.అప్పుడప్పుడు గ్రద్దల్లాంటి పక్షులు కుందేలు వంటివి తన్నుకుపోవడం విని ఉంటాం.
అయితే ఓ పక్షి మాత్రం వీటన్నింటికంటే భిన్నంగా వ్యవహరిస్తుంది.పిజ్జాలంటే ఎంతో ఇష్టపడుతూ, అవి కనిపించగానే అమాంతంగా ఎత్తుకుపోతోంది.
అలా పిజ్జాను తీసుకుని ఈ పక్షి వెళ్లిపోయే వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్గా మారింది.
సీగల్ అనే పేరున్న పక్షులు విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
సముద్ర తీరంలో తచ్చాడుతూ ఉండే ఈ పక్షులు మన దేశంలో కనిపించవు.ప్రత్యేకించి అవి ఒకే ఆహారాన్ని తింటాయని చెప్పలేం.
అయితే ఇటీవల ఓ సీగల్ పక్షి చేసిన పని నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.ఓ వీడియోలో ఓ మహిళ తనకు ఇష్టమైన పిజ్జాను ఆర్డర్ చేసింది.
డెలివరీ బాయ్ దానిని తెచ్చివ్వగానే బయట టేబుల్పై పెట్టి, ఇంట్లోకి వెళ్లింది.ఇలా వెళ్లి, అలా వచ్చేలోపే ఆమె పిజ్జా మాయమైంది.
ఓ సీగల్ పక్షి ఆ పిజ్జాను నోటకరచుకుని ఎగిరిపోయింది.తన నోటి దగ్గరి పిజ్జాను పక్షి ఎత్తుకుపోవడంతో ఆ మహిళ చేసేదేమీ లేక అలాగే చూస్తూ ఉండిపోయింది.ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది.దీనిని చూసిన వారంతా పక్షి తెలివిని మెచ్చుకుంటూనే ఆ మహిళ పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నారు.సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోకు విపరీతంగా లైక్లు వస్తున్నాయి.చాలా మంది ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తున్నారు.
లైకులతో పాటు దీనికి షేర్లు, కామెంట్లు కూడా భారీగా వస్తున్నాయి.