కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ప్రజలు మారిపోయారు.ఎంతో పరిశుభ్రంగా ఉంటున్నారు.
ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే మరి కొద్దీ రోజుల్లో రైళ్లు కూడా మారనున్నాయి.
రైలు ప్రయాణాలు కూడా విమానాల్లో ప్రయాణంలా మారనుంది.ప్లాట్ఫాం మొదలుకుని, టిక్కెట్ల జారీ, స్టేషన్లు ఇలా అన్ని మారనున్నాయి.
రైలు ప్రయాణంలో ప్రతి మార్పు విప్లవాత్మకంగా మారనుంది.ఇంకా ఆహారం సైతం మంచి ప్యాకింగ్ లో చెయ్యనున్నారు.అతి త్వరలోనే రైల్వే స్టేషన్లు కూడా విమానాశ్రయాల్లా మారిపోనున్నాయి.విమానాశ్రయాలకు వెళ్లినా సమయంలోలానే రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణానికి నాలుగు గంటల ముందు రిపోర్ట్ చెయ్యాల్సి ఉంటుంది.
అంతేకాదు ఎయిర్ పోర్ట్లలో ఎలా అయితే స్కీృనింగ్ విధానం అమలు చేస్తారో రైల్వే స్టేషన్లలో కూడా అదే విధానం అమలవుతుంది.ఇంకా బాత్రుమ్ల వద్ద శానిటైజర్ల నుండి అన్ని విమానాశ్రయంలోలనే మారనున్నాయి.
ప్రయాణికులు కూడా తప్పనిసరిగా శానిటైజర్లు తమతో తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
.