జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు.ఏకంగా ప్రభుత్వ పాఠశాలలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.
ఇడ్గా సంగం ప్రాంతంలో ఉన్న పాఠశాలల పై ఉగ్రవాదులు దాడులు చేయడం జరిగింది.ఈ క్రమంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు టీచర్లు మరణించారు.
టీచర్లను రెండు వర్గాలుగా విభజించి.ఉగ్రవాదులు కాల్పులు జరపటం జరిగింది.
మృతులలో ఒకరు స్కూల్ ప్రిన్సిపాల్ కాగా మరొకరు సబ్జెక్టు ఉపాధ్యాయుడిగా గుర్తించడం జరిగింది.ఈ క్రమంలో భారత సైన్యం అక్కడికి చేరుకొని టెర్రరిస్టులను పట్టుకోవడానికి రంగంలోకి దిగింది.
టెర్రరిస్టులను మట్టుపెట్టడానికి బలగాలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో.తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయి.ఈ క్రమంలో సైన్యం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు.
నిఘా భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసిన గాని.ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.
దీంతో కేంద్ర రక్షణ శాఖ.తాజా పరిస్థితుల విషయంలో.సైనిక ఉన్నతాధికారులతో చర్చించినట్లు వార్తలు అందుతున్నాయి.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో.చాలావరకు ఉగ్రవాదులను సైనికులు మట్టు పెట్టడం జరిగింది.అయినా గాని ఇటీవల ఉగ్రవాదుల దాడులు జరగడం తో… కేంద్రం అలర్ట్ అవుతుంది.