వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కత్తి దాడి సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఘటన రాజకీయ పార్టీల మధ్య మరింత అగ్గి రాజేసింది.
ఇది ఇలా ఉంటే … తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖపట్నం ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
వైసీపీ అధినేత జగన్పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు ప్రాణహాని ఉన్నదన్న అంశంపై 30 రోజుల్లోగా నివేదిక అందజేయాల్సిందిగా సూచించింది.శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందంటూ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్ప్రసాద్.ఎస్సీ కమిషన్కు లేఖ రాశారు.
ఈ లేఖపై స్పందించిన కమిషన్.పైవిధంగా ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు