స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్నో టాప్ కంపెనీలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి.ఇంకా అలానే దేశ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగదారులకు అద్భుతమైన శుభవార్త చెప్పింది.
ఆ శుభవార్త వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.అది ఏంటంటే.
స్టేట్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉన్నవారికి ఇకపై ఎస్ఎంఎస్ ఫీజు వెయ్యరు.
అంతేకాదు మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టెయిన్ చెయ్యకపోయినా ఖాతాదారులు ఎటువంటి ఛార్జీలు తీసుకోకూడదు అని స్టేట్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సమాచారాన్ని ఎస్బిఐ తన ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసింది.మినిమమ్ బ్యాలెన్స్ మూడు వేలు ఖాతాలో ఉండాలని లేకపోతే మినిమమ్ బ్యాలెన్స్ అకౌంట్ కిందా చార్జెస్ వేసేవారు.
అయితే ఇప్పటి నుంచి ఆ ఛార్జెస్ లేవని ఎస్బిఐ ప్రకటించింది.ఇంకా అలానే అకౌంట్ ట్రాన్సక్షన్స్ కి సంబంధించిన సమాచారం ఇచ్చే ఎస్ఎంఎస్ నుంచి కూడా ప్రతి మూడు నెలలకు ఛార్జెస్ వేసేది.
ఇప్పుడు అవి అన్ని కూడా తీసివేసినట్టు ఎస్బిఐ ఖాతాదారులకు వెల్లడించింది.కాగా మినిమమ్ ఛార్జెస్ కింద ఎంత అంటే అంత ఛార్జెస్ వేసే ఎస్బిఐ ఇప్పుడు ఆపేసింది.