అఖిల్‌పై హీరోయిన్‌ సైతం ఆగ్రహం

అఖిల్‌ హీరోగా పరిచయం అయిన ‘అఖిల్‌’ చిత్రం అట్లర్‌ ఫ్లాప్‌ అయిన విషయం తెల్సిందే.ఆ సినిమాను యువ హీరో నితిన్‌ ఏకంగా 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు.

 Sayesha Saigal Serious On Akhil Producers-TeluguStop.com

వివి వినాయక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది.

దాంతో దర్శకుడు వినాయక్‌కు ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌ పారితోషికం ఇవ్వలేదు.అదే విధంగా మరి కొందరికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌ ఎమౌంట్లను సైతం నిర్మాతలు ఇవ్వలేదని తెలుస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా సయేషా సైగల్‌ నటించింది.ఆమెకు ఈ చిత్రంలో నటించినందుకు గాను 75 లక్షల పారితోషికం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.

సినిమా షూటింగ్‌ సమయంలో 50 లక్షలు ముట్టాయి.మిగిలిన బ్యాలన్స్‌ 25 లక్షలు సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో నిర్మాతలు ఇవ్వలేదు.

దాంతో హీరోయిన్‌ సయేషా మాత్రం తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చే వరకు వదిలేది లేదు అంటూ పట్టుదలతో ఉంది.ఇప్పటికే పలు సార్లు నిర్మాతలతో ఈ విషయంపై చర్చలు జరిపిందని, అయినా కూడా వారు ఇచ్చేందుకు ముందుకు రాక పోవడంతో ఫిల్మ్‌ పెద్దలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

మరి ఈ వివాదం పెద్దలకు వరకు వెళ్లే వరకు నిర్మాతలు చూస్తారా లేక ముందే తేల్చి వేస్తారా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube